14-06-2025 04:15:12 PM
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని(విజయక్రాంతి): పేద ప్రజల ఆపద్బాంధవుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయడంతో పాటు నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య,ఇతర అవసరాలను తీరుస్తున్న శ్రీనుబాబు చేస్తున్న సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి రాష్ట్ర నాయకత్వంలో చోటు కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తూ ముందుకు సాగాలని కోరారు. రాబోయే రోజుల్లో దుద్దిళ్ల కుటుంబం మరెన్నో గొప్ప పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరవేన లింగయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.