28-05-2025 09:35:23 PM
సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట పట్టణ సమీపంలో గల ఎంఆర్ఎఫ్ మెదక్ ప్లాంట్ పరిశ్రమలో బుధవారం జరిగిన ఎన్నికలలో (కెపిఎస్) కార్మిక పోరాట సమితి, కి సంబంధించిన కొత్తగొల్ల చంద్రశేఖర్ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కేపీయస్, కు సంబందించినటువంటి పులి, గుర్తుకు 584, ఓట్లు సీఐటీయూ చుక్క గుర్తు కు 445 ఓట్లు, బీయంయస్ కు 382 ఓట్లు, టీయంటీడబ్లు కు 164 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి అయినటువంటి చుక్క గుర్తుపై పులి గుర్తు అయినటువంటి కేపీయస్ 139 ఓట్ల భారీ మెజార్టీ సాధించటం జరిగిందని కార్మిక పోరాట సమితి నాయకులు తెలపడం జరిగింది.