calender_icon.png 12 June, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి

11-06-2025 11:46:09 AM

హైదరాబాద్: తెలంగాణలో, దేశంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. బీఆర్‌కేఆర్ భవన్(BRKR Bhavan) వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీది కేవలం దుష్ప్రచారమన్నారు. బీఆర్ఎస్ గానీ, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) గానీ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వివరించారు. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కట్టినా గొప్ప పురస్కారం దక్కేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసి ఉంటారని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వంద కాంపోనెంట్స్ ఉన్నాయని, ఒక్కదాంట్లో చిన్న సమస్య వస్తే, మొత్తం ప్రాజెక్టు వేస్ట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని కేటీఆర్ స్పష్టం చేశఆరు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూలగొట్టటానికి వచ్చాడు.. తప్ప కట్టడానికి కాదన్నారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు తప్ప ఈ సన్నాసికి ఏం చేతకాదని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు(Kaleshwaram Commission) హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, ఎమ్మెల్యేలు హ‌రీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప‌ద్మారావు గౌడ్, బండారి ల‌క్ష్మారెడ్డి, ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మ‌హ‌ముద్ అలీ తదితరులున్నారు. కేసీఆర్ సంఘీభావంగా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు వేలాది మంది నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.  బీఆర్‌కే భవన్ వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.