20-10-2025 12:23:46 AM
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : స్థానిక ప్రతిభను ప్రోత్సహిం చడంలో తమ నిబద్ధతను ప్రదర్శి స్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారా -అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెంది న ఆమె శుక్రవారం హైదరాబాద్లోని నంది నగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయ నను కలిశారు.
కుట్టుపని చేసుకుని జీవనోపాధిని గడుపుతున్న అర్చన, డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాం పియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎంపికయ్యారు. అయితే ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ తక్షణమే స్పందించి, అర్చనను వ్యక్తిగతం గా కలిసి మాట్లాడారు.
ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, చాంపియన్షిప్కు సిద్ధమ య్యేందుకు అవసరమై న క్రీడా పరికరాలు, శిక్షణా సామగ్రిని కూడా ఆమెకు అందజేశారు. కేటీఆర్ నుంచి సకాలంలో లభించిన ప్రోత్సాహంతో, అంతర్జాతీయ వేదికపైభారత్కు ప్రాతినిథ్యం వహించాలనే అర్చన కల సాకారం అవుతుంది.
అర్చన పోరాటం స్ఫూర్తిదాయకం: కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... “అర్చన కథ ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. చంద్రంపేటలోని ఒక కుట్టు మిషన్ నుంచి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం. తెలంగాణ ఆమెను చూసి గర్విస్తోంది. రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు ఆమెకు అవసరమైన పూర్తి సహాయం అందిస్తాం” అని భరోసా ఇచ్చారు.