కుల్గామ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు, ఇద్దరు సైనికులు మరణించారు. కుల్గామ్లో జరిగిన జంట ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆర్ ఆర్ స్వైన్ విలేకరులతో అన్నారు.
మృతదేహాల నిర్ధారణ ప్రకారం ఇప్పటి వరకు కుల్గామ్లో జరిగిన జంట కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జంట ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమార్చడం భద్రతా బలగాలకు మైలురాయి అని డిజిపి అన్నారు. మిలిటెంట్ల ఉనికి గురించి ఇన్పుట్ల ఆధారంగా భద్రతా సిబ్బంది గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత నిన్న మధ్యాహ్నం గ్రామంలో ఉగ్రవాదుల బృందం, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. మోడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన తొలి కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడగా, అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించాడు. మరణించిన సైనికుడిని పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నైన్గా గుర్తించారు.






