13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

12 లక్షల కోట్లు హాంఫట్

10-03-2026 02:45 AM

ముంబై, మార్చి ౯: పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నది. సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసాయి. ప్రారంభంలోనే బెంచ్‌మార్క్ సూచీలు తీవ్రంగా క్షీణించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ కీలకమైన 24 వేల స్థాయి కిందకు జారింది. మార్కెట్ల పత నంతో పెట్టుబడిదారుల సంపదలో ఒకేరోజులో సుమారు రూ.12 లక్షల కోట్లు ఆవిరైంది.

రంగాల వారీగా.. బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో అత్యధిక అమ్మకాలు న మోదయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ ప్రారంభంలోనే నాలుగు శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. జపాన్ లికీ సూచీ, దక్షణ కొరియా కోస్పీ సూచీలు బాగా పడిపోయాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.