8 March, 2026 | 12:06 AM

నూతన తహసీల్దారుగా లక్ష్మి బాధ్యతలు స్వీకారం

07-03-2026 10:09 PM

శ్రీరంగాపురం: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల నూతన తహసీల్దారుగా లక్ష్మి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన బాధ్యతల స్వీకరణ అనంతరం తహసీల్దార్ లక్ష్మి మాట్లాడుతూ... మండలంలో ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

భూ సంబంధిత సమస్యలు, ఆదాయ ధృవపత్రాలు, కుల ధృవపత్రాలు వంటి రెవెన్యూ సేవలను ప్రజలకు సులభంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అలాగే కార్యాలయానికి వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.