08-10-2025 12:50:29 AM
పాల్గొన్న రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల,అక్టోబర్ 7(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన స్వామి వారి రథోత్సవంలో రాష్ట్ర బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు..
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఘనంగా సన్మానించి. ఆశీర్వచనం అందజేశా రు.స్వామి వారి దర్శనానికి దేవాదాయ ధర్మాదాయ శాఖా వారి ఆధ్వర్యంలో మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలనివేడుకొన్నారు..