నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే భూ సేకరణ
07-05-2026 03:58 PM
సదాశివనగర్,మే07(విజయక్రాంతి): భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రోడ్డు సర్వే చేయాలనీ గ్రామ సభలో తీర్మానం చేశారు.కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్, ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.టీజీ ఐ ఐ సి లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు టీ జీ ఐ ఐ సి కంపెనీ అప్రోచ్ రోడ్ భూ సేకరణ సర్వే నిలిపివేయాలని తీర్మానం చేసినట్టు సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్ ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం తెలిపారు.కార్యక్రమంలో మండల తహసిల్దార్ సత్యనారాయణ ,గిర్ధావార్ సంతోష్ ,సర్వేయర్, జిపిఓ మరియు పాలకవర్గ సభ్యులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






