7 May, 2026 | 4:53 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే భూ సేకరణ

07-05-2026 03:58 PM

సదాశివనగర్,మే07(విజయక్రాంతి): భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రోడ్డు సర్వే చేయాలనీ గ్రామ సభలో తీర్మానం చేశారు.కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్, ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.టీజీ ఐ ఐ సి లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు టీ జీ ఐ ఐ సి కంపెనీ అప్రోచ్ రోడ్ భూ సేకరణ సర్వే నిలిపివేయాలని తీర్మానం చేసినట్టు సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్ ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం తెలిపారు.కార్యక్రమంలో మండల తహసిల్దార్ సత్యనారాయణ ,గిర్ధావార్ సంతోష్ ,సర్వేయర్, జిపిఓ మరియు పాలకవర్గ సభ్యులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.