గ్రామాన్నే తుడిచిపెట్టిన కొండచరియలు
03-09-2025 01:22 AM
సూడాన్లో వెయ్యి మంది మృతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అంతర్యుద్ధంతో అతలాకుతలం అవుతున్న సూడన్పై ప్రకృతి పగ తీర్చుకుంది. కొండచరియలు విరిగిపడి ఓ గ్రామానికి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో దాదాపు 1,000 మంది మరణించారు. సూడాన్లోని డార్ఫూర్ రీజియన్ లో భారీ వర్షాలు కురిసిన అనంతరం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న రెబెల్స్ ఈ విషయాన్ని మంగళవారం ధృవీకరించారు.




