ప్రధాని మోదీకి తొలి సెమీ కండక్టర్ చిప్ అందజేత
03-09-2025 01:23 AM
విక్రమ్ నామకరణం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశరాజధాని న్యూఢిల్లీ సెమీకాన్ ఇండియా సదస్సు జరిగింది. ఇందులో భాగంగా ఇండియాలో తయారయిన తొలి 32 బిట్ సెమీకండక్టర్ చిప్ను ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అందజేశారు. దేశీయంగా తయారయిన ఈ 32 బిట్ సెమీకండక్టర్ చిప్కు విక్రమ్గా నామకరణం చేశారు. సెమీకండక్టర్లు ‘డిజిటల్ డైమండ్స్’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
నూతన యుగంలో సెమీకండక్టర్స్ డిజిటల్ డైమండ్, ఆయిల్ బ్లాక్ గోల్డ్ అని మోదీ పేర్కొన్నారు. ‘కొన్నేళ్ల క్రితం మోదీ విజన్ వల్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించాం. కేవలం మూడున్నర సంవత్సరాల్లోనే తొలి సెమీకండక్టర్ను ప్రధానికి అందజేశాం. నేడు ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి’ అని తెలిపారు.




