03-06-2025 12:05:10 AM
నాగర్కర్నూల్, జూన్ 2 (విజయక్రాంతి): పదవ తరగతి - 2025 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిఎన్ఆర్ పాఠశాల విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ల్యాప్ టాప్లు, నగదు బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలకు హాజరైన ఎమ్మెల్యే ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు లక్ష్మీ నిహాస్ (581), నేహా శ్రీ (580), మధుకర్ గౌడ్ (578) లకు ల్యాప్టాప్లు అందజేశారు.
హితేష్ తేజ్ గౌడ్ (574), హరిణి (573), శాలిని (573), సుహా ఫాతిమా (573), శివారెడ్డి (572), శ్రీకర్ (566), సయ్యద్ రేహాన్ లాయక్అలీ (561) లకు ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ సి. భాస్కరరావు, చంద్రకళ, జనచైతన్య సొసైటీ చైర్మన్ సయ్యద్ రఫీయోద్దీన్, కవిత, హజీరా, యాజమాన్య ప్రతినిధులు సయ్యద్ ఫసియోద్దీన్, వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.