20-06-2025 12:00:00 AM
మోటివేటర్ కేవీ.ప్రదీప్ కుమార్, సెమ్స్ కన్వీనర్ ఆరుకాల రామచంద్రారెడ్డి
ముషీరాబాద్, జూన్ 19: (విజయక్రాంతి): విద్యార్థులలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసి, పోటీ తాత్వాన్ని పెంచి భవిష్యత్ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిమ్స్ ఒలంపియాడ్ పరీక్షలు ఎంతో దోహదపడతాయని ప్రముఖ సినీ నటుడు మోటివేటర్ కెవి ప్రదీప్ కుమార్, సెమ్స్ కన్వీనర్ ఆరు కాల రామచంద్రారెడ్డిలు అన్నారు. ఈ మేరకు గురువారం ఒలంపియాడ్ పరీక్ష ఫలితాలను ఆయన సెన్స్ కమిటీ మెంబర్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ ఎన్ రెడ్డిలతో కలిసి వారు విడుదల చేశారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఒలింపియాడ్ పరీక్షలలో విద్యార్థులు అత్యంత ఆసక్తి గట్టి పోటీని ప్రదర్శించి ప్రతిభ కనబర్చినందులకు వారి ని అభినందస్తూ వారిని ఈనెల 28 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ’అవారడ్స్ సెర్మనీ’ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అందులో నేషనల్ ర్యాంక్ లు, స్టేట్ 1వ ర్యాంక్ నుండి 4వ ర్యాంక్ పొందిన విద్యార్థులకు ప్రావీణ్య పురస్కార్, ఎలైట్ అవారడ్స్, నగదు అవార్డుతో పాటు మెడల్, మేమేంటో, సర్టిఫికెట్ అందచేయడంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించడంతో పాటు కరస్పాం డెంట్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులను అవారడ్స్ తో ఘనంగా సత్కరించునున్నట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర స్థాయి ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
పాఠశాలల విద్యార్థుల రిజలట్స్ కొరకు https:// semsolympiad.org వెబ్ సైట్ లో తమ తమ స్కూల్ అకౌంట్ లాగిన్ అయ్యి విద్యార్థుల రిజలట్స్ చూడవచ్చన్నారు. అధ్యక్షు లు బాణాల రాఘవ, ఎం.జయరాం ప్రసాద్, ఎండీ.అస్లాం, పవన్, తదితరులు పాల్గొన్నారు.