14 July, 2026 | 3:19 PM

Breaking News

సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •  

రియల్ కోర్ట్ డ్రామాను కళ్లకు కట్టే ‘లీగల్లీ వీర్’

10-12-2024 12:00 AM

వీర్‌రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హీరో వీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా టైంలో నాకు సినిమా వాళ్లతో పరిచయం ఏర్పడింది. అప్పుడే మంచి సినిమా చేద్దామనుకున్న. రియల్ కోర్టు డ్రామాను మా సినిమాలో చూపించాం’ అన్నారు. డైరెక్టర్ రవి, కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్, నటుడు గిరిధర్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.