సైబర్ నేర సామ్రాజ్యంపై పోరాటం
10-12-2024 12:00 AM
నటుడు సోనూసూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచనాదర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనాలి సూద్, ఉమేశ్ కేఆర్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2025, జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ విడుదల సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. “ఫతే’ నాకు చాలా ప్రత్యేకం. ఇది దర్శకుడిగా నా అరంగేట్రమే కాదు.. మనలో చాలా మంది తక్కువ అంచనా వేసే సైబర్ ప్రపంచంలోని అదృశ్య, చీకటి శక్తులకు వ్యతిరేకంగా ఇది ఒక వాయిస్. మనలో చాలా మంది చూడని యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కొనే హీరోలందరి కోసం ఈ సినిమా చేశాను’ అన్నారు.






