17 March, 2026 | 1:25 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

చర్లపల్లి అడవుల్లో చిరుత కలకలం

04-12-2024 01:34 AM

పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు

భయాందోళనలో అటవీగ్రామాల ప్రజలు

బెల్లంపల్లి, డిసెంబర్ 3: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చర్లపల్లి అడవుల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంగళవారం చిరుతసంచరించినట్టు గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించి, అవి చిరుత అడుగులేనని తేల్చారు.

బెల్లంపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ సిబ్బందితో కలిసి చిరుత కదలికలపై ఆరా తీశారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచా రం ఉందని, తాము బయటకు రావడానికీ భయపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శంకరపల్లి పరిసరాల్లో పెద్దపులిని గుర్తించారు. అది మహారాష్ట్ర నుంచి పత్తి ఏరేందుకు వచ్చిన కూలీల కంటపడిందని తెలిసింది.