6 May, 2026 | 7:54 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

చర్లపల్లి అడవుల్లో చిరుత కలకలం

04-12-2024 01:34 AM

పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు

భయాందోళనలో అటవీగ్రామాల ప్రజలు

బెల్లంపల్లి, డిసెంబర్ 3: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చర్లపల్లి అడవుల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మంగళవారం చిరుతసంచరించినట్టు గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించి, అవి చిరుత అడుగులేనని తేల్చారు.

బెల్లంపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ సిబ్బందితో కలిసి చిరుత కదలికలపై ఆరా తీశారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచా రం ఉందని, తాము బయటకు రావడానికీ భయపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శంకరపల్లి పరిసరాల్లో పెద్దపులిని గుర్తించారు. అది మహారాష్ట్ర నుంచి పత్తి ఏరేందుకు వచ్చిన కూలీల కంటపడిందని తెలిసింది.