07-06-2025 07:20:58 PM
ఎంఎస్పి జాతీయ నాయకులు, జిల్లా ఇంచార్జీ మంద కుమార్ మాదిగ..
సిద్దిపేట (విజయక్రాంతి): జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ వార్షికోత్సవాన్ని గ్రామ గ్రామన ఘనంగా నిర్వహిద్దామని ఎంఎస్పి జాతీయ నాయకులు, జిల్లా ఇంచార్జీ మంద కుమార్ మాదిగ అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జిల్లా ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, ఎంఎస్ఎఫ్, అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కపల్లి రాజు మాదిగ(MRPS District General Secretary Mukkapalli Raju Madiga) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంద కుమార్ మాట్లాడుతూ... మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల, గ్రామాల ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణంకై కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ వార్షికోత్సవాన్ని గ్రామ గ్రామన ఘనంగా నిర్వహిస్తామన్నారు. నెల రోజులపాటు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సంస్థగత నిర్మాణమే లక్ష్యంగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు. నూతన కమిటీల ఏర్పాటుతో ఒక సైన్యంలా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జిల్లా ఇంచార్జీ బొచ్చు తిరుపతి మాదిగ, ఎంఎస్పి సిద్దిపేట జిల్లా సీనియర్ నాయకులు మల్లిగారి యాదగిరి మాదిగ, జేపీ లత మాదిగ, ఎంఎస్పి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పేర్క పరశురాం మాదిగ, ఎంఎస్పి నాయకులు మైస రాములు, చింతకింది పరశురాముల, ప్రేమలత, జెరిపోతుల లక్ష్మణ్, సుంచు రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.