calender_icon.png 8 June, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

07-06-2025 07:16:37 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో కెనాల్ బ్రిడ్జి దగ్గర శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి. గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కర్కాల రామ్మోహన్ రెడ్డి(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. శుక్రవారం రాత్రి 8:30 సమయంలో బయటికి వెళ్లివస్తానని భార్యకు చెప్పి తన ద్విచక్రవాహనంపై ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. అదే క్రమంలో రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కొండపోచమ్మ కెనాల్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రామ్మోహన్ రెడ్డి తలకు, చాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన ప్రయాణికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు వెళ్లి చూసేసరికి రామ్మోహన్ రెడ్డి మృతి చెందాడు. ఇట్టి సంఘటన పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని నా భర్త మృతి చెందాడని అట్టి వాహనమును గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మృతుడి భార్య కర్కాల మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.