మల్లు రవిని గెలిపించుకుందాం

21-04-2024 12:30:00 AM

l ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రె స్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వనపర్తిలో ఉమ్మడి గోపాల్‌పేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ మాయమాటలు నమ్మవ ద్దని చెప్పారు. కాం గ్రెస్ ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు.