ప్రశ్నించే గొంతును గెలిపించుకుందాం
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి, మే 15 (విజయక్రాంతి) : ఖమ్మం, వరంగల్, నల్లగొండ శాసనమండలి పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించుకుందామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు. బుధవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఆయనను గెలిపించుకోవడం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మె ల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డానని, ప్రభుత్వ నిరాంకుశ వైఖరిని ఎండగట్టి జైలు జీవితం గడిపానన్నారు. ఈ ప్రాంత వాసిగా తనకు మద్దతుగా ఉండాలని కోరారు.




