15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అర్బన్ సీఐ భాను ప్రకాష్

23-06-2025 06:39 PM

ఖమ్మం (విజయక్రాంతి): మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో భాగంగా యువత, విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఖమ్మం అర్బన్ సీఐ భాను ప్రకాష్(CI Bhanu Prakash) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం ఆర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం టేకులపల్లిలోని డైట్ కాలేజ్ లో మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని, తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు. నాటిన ప్రతి మొక్కను రక్షించి భావితరాలకు బాసటగా నిలవాలని సూచించారు.