calender_icon.png 20 June, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకుందాం!

01-09-2024 12:00:00 AM

మన్నారం నాగరాజు :

రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జ్వర పీడిత గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

తెలంగాణలో విషజ్వరాలతో పల్లె లు, పట్టణాలు మంచమెక్కుతున్నాయి. సీజనల్ వ్యాధులతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నా రు. రాజధాని హైదరాబాద్‌లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీతోపాటు ఫీవర్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య విపరీతం గా పెరుగుతున్నది. ఈ ఆసుపత్రులకు వస్తున్న వారిలో సగానికి పైగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారేనని తెలుస్తున్నది. రాష్ట్రంలో కొన్నిచోట్ల వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు హాజ రుకావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పనిచేసే చోట కాకుండా దగ్గరలోని పట్టణాలలో నివాసముంటూ ఏదో ఒక సమ యానికి ఆసుపత్రులకు వచ్చి వెళుతున్న ట్టు తెలుస్తున్నది. దీంతో తప్పని పరిస్థితు ల్లో ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. గతంలో ఈ తరుణంలో జ్వరాలు వచ్చి నా, వైద్యం చేయించుకున్నా, లేకున్నా వారం రోజులకు తగ్గేవి. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. జ్వరంతోపాటు విపరీతమైన నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నా యి.

రోజుల తరబడి మందులు వాడినా ఫలితం లేకుండా పోతున్నది. ఆసుపత్రు లు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నా యి. కొన్ని ఆసుపత్రులు ‘కాసుపత్రులు’గా మారి అందిన కాడికి దండుకుంటున్నా యి. ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం తొంగిచూస్తున్నది. అధికా రం మారిన తర్వాత అప్రమత్తమైన వైద్యు లు మళ్లీ పాత పద్ధతికే మొగ్గుచూపుతుండటం బాధాకరం. వైద్యులు, సిబ్బంది వేళ కు ఆసుపత్రులకు రాకపోవడం, వచ్చినా సరిగ్గా విధులు నిర్వహించక పోవడం, సమయపాలన పాటించక పోవడం రోగు ల పాలిట శాపంగా మారింది. 

నిరంతర పర్యవేక్షణ అవసరం

రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులపై నిరంత ర పర్యవేక్షణ ఉండేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జ్వర పీడిత గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మందులు ఉండేలా చర్యలు తీసుకోవాల ని ప్రజలు కోరుతున్నారు. ప్రజలపై విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఏకకాలంలో సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగీ, మలేరియా వంటివి విజృంభిస్తున్నాయి.

రెండు నెలలుగా రాష్ట్రంలో పల్లె, పట్నం తేడా లేకుండా జనాలను డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్ గున్యా జ్వరాలు పీడిస్తున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా జ్వరాలతో బాధ పడుతున్న ప్రజలే కనిపిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లోని ఓపీ, ఇన్ పేషెంట్ బ్లాకులు పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో  బెడ్లు చాలని దైన్య పరిస్థితులు నెలకొన్నా యి. రాష్ట్రం ఆరోగ్య అత్యవసర పరిస్థితి దిశగా సాగుతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

లెక్కకు మించి కేసులు

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 21 వరకు 66,589 శాంపిళ్లను టెస్టు చేయగా 4,648 డెంగీ కేసులు నిర్ధారణయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివి టీ 7 శాతం చొప్పున నమోదైంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 1,697 కేసులు తేలగా, సూర్యాపేటలో 416, మేడ్చల్ మల్కాజిగిరిలో 405, ఖమ్మంలో 346, నల్లగొండలో 322, నిజామాబాద్‌లో 243, రంగారెడ్డిలో 222, జగిత్యాలలో 147, సంగారెడ్డిలో 115, వరంగల్లో 102 కేసులు చొప్పున నిర్ధారణయ్యాయి. రాష్ట్రం లో గత ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు సుమారు 3,821 డెంగీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి 1 నుం చి ఆగస్టు 22 వరకు  దాదాపు 5,246 కేసులు నిర్ధారణయ్యాయి. గతేడాది కంటే 34 శాతం కేసులు పెరిగాయి.

అయితే, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు, మరణాలను వైద్యారోగ్యశాఖ గుర్తించలేక పోతున్నదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇక  కొంతమంది తీవ్ర జ్వరంతో నడవలేని స్థితిలో ఎముకల నొప్పితో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వారిలో చికెన్ గున్యా లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. పలువురికి మలేరియా సోకినట్లు కూడా నిర్ధారణయింది.  అయితే, అధికారిక లెక్కల్లోకి రాని డెంగీ, చికెన్ గున్యా కేసులు ఇంకా ఎక్కువగానే ఉంటాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణం గా మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటా యి.

డెంగీ సోకిన వ్యక్తికి ప్లేట్లెట్లు 40 వేల వరకు ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదనీ, 30 వేల వరకు ఉంటే రక్తస్రావం కొద్దిగా కావొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుందని, ఆ సంఖ్య 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా ఉంటుందని వైద్యులు వివరించారు. డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స, పౌష్టికాహారం తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూడాలని వైద్యు లు సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదా పు అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపి సగటును 10 నుంచి 30 శాతం వరకు పెరిగింది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియా ల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఇరవై రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళ న కలిగిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పగ లు వేసవిని తలపిస్తుంటే, సాయంత్రం భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జలుబు, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు విస్తరిస్తున్నాయి. 

పారిశుద్ధ్య లోపం

వైరల్ జ్వరాల నియంత్రణకు ముంద స్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేకించి పల్లెలు, పురపాలికల్లో పారిశుద్ధ్య లోపం విషజ్వరాల విజృంభణకు కారణమవుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాల కు నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు, ఇతర హానికర బ్యాక్టీరియా పెరిగిపోతున్నది.  దోమల నివారణ కోసం నిబంధనల మేరకు ప్రతి 45 రోజులకు ఫాగింగ్ చేయాలి. డెంగీ ప్రభావిత జిల్లాల్లోనైతే ఇంతకన్నా తక్కువ వ్యవధిలోనే ఫాగింగ్ జరగాలి. దీనిని సిబ్బంది విస్మరిస్తున్నారు. కనీసం బ్లీచింగ్ కూడా వేయడం లేదు.

డ్రైడేను పాటించడం లేదు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి విషజ్వరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలి. ఇంటింటి ఆరోగ్య సర్వేను త్వరగా పూర్తి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు. విషజ్వరాల విజృంభణ మరీ ఎక్కువగా ఉన్నచో ట్ల ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు రాష్ట్రస్థాయి ఆస్పత్రుల వరకు పడకల సంఖ్యను పెంచాలన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మలేరియా, డెంగీ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు అన్ని పీహెచ్‌సీలకు పంపడంతోపాటు జ్వరాల నియం త్రణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. 

వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

లోక్ సత్తా పార్టీ

సెల్: 9550844433