30-06-2025 02:33:41 AM
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్లోని ప్రజాభ వన్లో మంగళవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కు మార్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభు త్వం ఆ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగనున్నది. రాష్ట్రనీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రజెంటేషన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు. మంత్రి ఉత్తమ్ వారికి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలను, ఏపీ ప్రభుత్వ ఉల్లంఘనలను విశదీకరించనున్నారు.