calender_icon.png 30 June, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ‘బనకచర్ల’పై ప్రజెంటేషన్

30-06-2025 02:33:41 AM

  1. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహణ
  2. ఏపీ ప్రభుత్వ ఉల్లంఘనలపై వివరణ
  3. హాజరు కానున్న సీఎం 

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రజాభ వన్‌లో మంగళవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభు త్వం ఆ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగనున్నది. రాష్ట్రనీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు. మంత్రి ఉత్తమ్ వారికి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలను, ఏపీ ప్రభుత్వ ఉల్లంఘనలను విశదీకరించనున్నారు.