04-06-2025 12:00:00 AM
మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 3 (విజయ క్రాంతి) : అందరు మెచ్చేల అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ ను ప్రారంభించి, సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి, ఈ గ్రామం తో పాటు టంకర, పెద్దదర్పల్లి, తిరుమలగిరి, మునిమోక్షం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేశారు.
ఈ మేరకు ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే ఈ కార్యక్రమాలను సందర్భంగా మాట్లాడారు. సమాజంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించాలన్నారు. గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు వద్ద మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ పొందవచ్చు అని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలను ఎంపిక చేసుకొని గ్రామాల్లో ఉన్న మహిళల సాధికారత కోసం పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
అనంతరం పలుకు తండాలో గడచిన శనివారం లక్ష్మణ్ నాయక్, ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన మునిమోక్షం వెంకట్ రెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర హైమాస్ట్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ , కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, గ్రామ స్వరాజ్య సంస్థ అధ్యక్ష , కార్యదర్శులు పప్పుల సుధాకర్, తల్లూరి సలేందర్ కుమార్, కో ఆర్డినేటర్ వట్టెం రాములమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.