calender_icon.png 24 June, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే సాధ్యం

04-06-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు అందరు కృషి చేయాలి..

బడిబాట కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (విజయ క్రాంతి)ప్రభుత్వ పాఠశాలలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలను పొం దేలా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్  జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి. ఓ.సి, కార్యాలయం లో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడిన  సమన్వయ సమావేశంలో  కలెక్టర్   మాట్లాడుతూ,  జూన్  6 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు  బడిబాట కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వ హించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు,

డిజిటల్ విద్య , ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి అందరికీ తెలియజేసి,  వారందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్చే విధంగా చర్యలు తీ సుకోవాలన్నారు.6 నుండి 14 సం. వయసు కలిగిన బడిఈడు పిల్లలందరిని గుర్తించి, సమీపంలోని  బడికి వెళ్లేలాగా ప్రోత్సహించాలన్నారు.మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులతో, మహిళా సమాఖ్యల ద్వారా, 

వారి తల్లిదండ్రులతో మాట్లాడి,  అర్హత కలిగిన తరగతుల్లో తిరిగి చేర్పించేలా  క్షేత్రస్థాయిలో  చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్య గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బడిబాట కా ర్యక్రమంలో  మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని అన్నారు.

బడిబాట కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు ఎవ రైతే పిల్లలను పంపించడానికి ఇష్టపడటం లేదో దానికి గల కారణాలను నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయులు గ్రామాలలో తల్లిదండ్రులతో  సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు అందించే నాణ్యమైన విద్య గురించి వారికి అవగాహన కల్పించాలన్నారు.   భ విత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గు ర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఉల్లాసం యాప్ ద్వారా 15 సంవత్సరాల కంటే పైబడిన వయస్సు వారిలో నిరక్షరాశులను గుర్తించి వారికి అభ్యాసం కల్పించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. జిల్లాలో 100% అక్షరాస్యత సాధించే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్,జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి,  జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇందిర, మహి ళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా,   జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఏపీఎంలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.