calender_icon.png 24 June, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం

24-06-2025 01:22:41 AM

భావితరాలకు మంచి భవిష్యత్తు ఇద్దాం ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల: జూన్ 23 (విజయక్రాంతి) జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు,యువత.విద్యార్థులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2 కె రన్.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.

డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని పిలుపునిచ్చారు.యువత గంజాయిలాంటి మత్తుపదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,చెడు అలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు.

ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.సమాజంలో మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో యువత,ప్రజలు పోలీసులకు సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు.అనంతరం ర్యాలీనిర్వహించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

రాజన్న సిరిసిల్ల జూన్ 23(విజయక్రాంతి)జిల్లాలోని ఇల్లంతాకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులు పోలీస్, సిబ్బందితో కలసి మొక్కలు నాటారు.మాదకద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వి ద్యార్థులతో కలిసి మొక్కలు నాటి అవగాహన కల్పించిన పోలీస్ సిబ్బంది.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరు ప్రకృతిని ప్రేమిస్తు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులతో ప్రతిజ్ఞ అనంతరం వారితో కలిసి సెల్ఫీ పా యింట్ వద్ద సెల్ఫీ దిగి విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా ఎస్పీ వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ మొగిలి, టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్,ఆర్.ఐలుమధుకర్,