calender_icon.png 24 June, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటివాడైన బండి సంజయ్

24-06-2025 01:24:14 AM

  1. బ్యాంకు రుణంతో పాత ఇంటిని కొనుగోలో చేసిన కేంద్ర మంత్రి

ఆ చిన్న ఇల్లు విలువ రూ.98 లక్షలు...అందులో బ్యాంకు లోన్ రూ.85 లక్షలు

కరీంనగర్, జూన్23(విజయక్రాంతి):కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుధీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న బండి సంజయ్ రెండు సార్లు కార్పొరేటర్ గా, రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం తన అత్తమ్మ నివాసంలోనే ఉంటున్నారు.

తన పేరిట ఒక్క ఆస్తి కూడా లేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయం పక్కనున్న రెండు గుంటల స్థలం కలిగిన పాత నివాసం అమ్మకానికి రావడంతో రూ.98 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొత్తంలో రూ.85 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకున్నదే. సంజయ్ సతీమణి అపర్ణ ఎస్ బీఐ ఆఫీసర్ కూడా కావడంతో బ్యాంకు లోన్ తో ఆ ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం.

అందులో భాగంగా సోమవారం కరీంనగర్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్ ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకున్నారు.మరోవైపు తొలిసారి చిన్న ఇంటిని కొనుగోలు చేసిన బండి సంజయ్.... ఎంపీ కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఆ ఇంటిని చూపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం కన్పించింది.

ఒక్కసారి కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే వందల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకోవడం చూస్తున్నాం. బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులను దాచుకోవడం చూశాం. కానీ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్న మా సంజయన్న మాత్రం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా సంపాదించుకోకుండా పార్టీకి, కార్యకర్తల కోసం ఖర్చు చేశారు. ఇన్నాళ్లకైనా ఓ ఇంటివాడైనందుకు సంతోషంగా ఉంది”అంటూ సంజయ్ అనుచరులు వ్యాఖ్యానించడంవిశేషం.