01-10-2025 12:52:02 AM
ఎస్పి యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మంగళవారం కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ భద్రతను మరింత మెరుగుపరచడానికి నిజాంసాగర్ చౌరస్తా నుండి న్యూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను పరిశీలించారు.
న్యూ బస్టాండ్ నుండి లింగంపేట్, ఎల్లారెడ్డి వైపు వాహన రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ సిగ్నల్స్ ను తనిఖీ చేసి, ఇకపై వాహనదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ మహేష్ కు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అని, సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.
ప్రతి ప్రయాణంలో ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రయాణం సురక్షితం అవుతుందని అన్నారు, రాంగ్ రూట్ లేదా అశ్రద్ధగా డ్రైవ్ చేయడం ప్రమాదాలను పెంచుతుందని తెలిపారు.డ్రంక్ అండ్ డ్ర్పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగంతో డ్రైవ్ చేయకూడదని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
అదే విధంగా సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్-సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం,రాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు జారీ చేయబడతాయని తెలిపారు.
అందువల్ల, కామారెడ్డి పట్టణ పౌరులు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి, పోలీసులకు సహకరించాలని కామారెడ్డి ఎస్పీ తెలిపినారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ మహేష్ , పట్టణ ఎస్త్స్ర నరేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.