హోర్ముజ్ను తెరిపిద్దాం!
- ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్
- శాంతి పునరుద్ధరణకు భారత్ సంపూర్ణ మద్దతు
- జలసంధి గుండా సురక్షిత ప్రయాణాలు అత్యవసరమన్న మోదీ
- ఇరాన్లోని అజ్ఞాత వ్యక్తితో సంప్రదింపుల్లో ఉన్నామన్న ట్రంప్
న్యూఢిల్లీ, మార్చి 24: ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే ప్రాముఖ్యతపై చర్చించారని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు. ఇరువురి మధ్య పశ్చిమాసియా లో ని పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు.
వీలైనంత త్వరగా ఉద్రిక్తతల ను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందని వివరించారు. హోర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షి తంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాల గురించి సంప్రదింపులు కొనసాగించడాన్ని భారత్ అంగీకరిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల అనంత రం తొలిసారిగా ట్రంప్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. సోమవారం ఐదురోజు ల యుద్ధ విరమణ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాంతినెలకొల్పేందు కు ఇరాన్లోని అజ్ఞాత, అత్యున్నత భా వాలు కలిగిన వ్యక్తితో తాము సంప్రదింపుల్లో ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ నాయకు డు మొజ్తాబా ఖమేనీ కాదన్నారు.
కాగా ఆ వ్యక్తి ఇరాన్ పార్లమెంట్ అధ్యక్షుడు మహమ్మ ద్ బాగేర్ అయి ఉంటాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంటుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇటీవల అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగాచ్చీలు ఇటీవల ఫోన్ లో నేరుగా సంభాషించినట్లు తెలుస్తుంది.




