calender_icon.png 7 June, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటి.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

06-06-2025 12:00:00 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

మంచిర్యాల, జూన్ 5 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించుకుందాం అని బీజేపీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో మొక్కల పెంపకం నిర్వహిస్తున్నామని, పర్యావరణం బాగుంటేనే దేశము, సమాజము బాగుంటుందనీ, రాబోవు తరాలకు మంచి వాతావరణంతో కూడుకున్నటువంటి సమాజాన్ని అందించగలుగుతామనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ జూన్ 5ను పురస్కరించుకుని పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 వరకు మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టారన్నారు.

అదే విధంగా జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో యోగ డే కార్యక్రమాలు నిర్వహించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గం అశోక్, తులా ఆంజనేయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.