06-06-2025 12:00:00 AM
బోథ్, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య కారకాలైన ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి ప్రకృతిని కాపాడుకోవాలని బోథ్ ఎఫ్.ఆర్.వో ప్రణ య్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో అటవీశాఖ అధికారులు, పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని తీశారు.
పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్ధాల ను తడి చెత్త పొడి చెత్తగా వేరుచేసి పలువురికి అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వన్యప్రాణులకు, అడవికి సేవలు అందించిన పలువురిని శాలువా తో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు, ఎంపీడీవో రమేష్, ఎస్సై ప్రవీణ్, మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, అబ్రార్, చట్ల ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.