30-06-2025 06:51:16 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్..
మణుగూరు (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తుందని, ఆ విధానాలపై పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్(CPM District Secretary Group Member Repakula Srinivas) అన్నారు. సోమవారం సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావులతో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం అన్నివిధాలా మేలు చేస్తోందని చెప్పారు. దేశ ప్రజల సమస్యలు పక్కతోవ పట్టించడానికి మతాన్ని వినియోగిస్తున్నదని తెలిపారు. ఈ వాస్తవాన్ని గమనించి ప్రజానుకూల విధానాల కోసం పోరాడాలని చెప్పారు. ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెబుతున్నదని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు కొడిశాల రాములు, దామల్ల వెంకన్న, పిట్టల నాగమణి, బొల్లం రాజు కార్యవర్గ సభ్యులు తోట పద్మ, కొండ్రుగౌరి, పల్లపు నాగేశ్వరరావు, నైనారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.