30-06-2025 06:47:26 PM
సాబీర్ పాషా..
టేకులపల్లి (విజయక్రాంతి): ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం అవుతుందని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ కార్యదర్శి సాబీర్ పాషా(CPI Secretary Sabir Pasha) అన్నారు. సోమవారం టేకులపల్లి మండలం సిపిఐ 13వ మహాసభలో పాల్గొని మాట్లాడారు. ఇల్లందు నియోజకవర్గ సిపిఐ నాయకులు సారయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జమలయ్య, కొత్తగూడెం సిపిఐ నాయకులు నేరెళ్ల రమేష్, టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోతు రామచందర్ తదితరులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు అయిత శ్రీరాములు, నాగార్జున చారి, ఎజ్జు భాస్కర్, గుగులోత్ శ్రీను, బానోత్ వీరన్న, కిర్లపూడి సుందర్ పాల్, డేగల రమేష్, జోగా కృష్ణవేణి, గూగులోత్ సోనీ, రాయల ఇందిరా తదితరులు పాల్గొన్నారు.