13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విద్యుత్ వినియోగదారులకు శుభాకాంక్షల లేఖలు

14-01-2026 01:06 AM

మంచిర్యాల, జనవరి 13 (విజయక్రాం తి) : విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. గృహ జ్యోతి లబ్ధిదారులకు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల సందేశ లేఖలను జిల్లాలో అందజేస్తున్నారు. వ్యక్తిగతంగా కలుస్తూ వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను టిజిఎన్పీడీసీఎల్ అధికారులు స్వయంగా వినియోగదారుల గృహాలను సందర్శించి పంపిణీ చేస్తున్నారు.