22 June, 2026 | 3:18 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

కొనసాగుతున్న మద్యం దుకాణాల లక్కీ డ్రా

27-10-2025 03:42 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ సర్కిల్ ల పరిధిలోని 73 ఏ4 మద్యం దుకాణాలకు 1712 దరఖాస్తులు రాగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ లో గల పీవీఆర్ గార్డెన్స్ లో లక్కీ డ్రా కొనసాగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమైన లక్కీ డ్రా సర్కిల్ ల వారిగా, ఒక్కొ దుకాణానికి వచ్చిన దరఖాస్తులను టోకెన్ ల వారిగా అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎక్సైజ్ సూపరింటెండెంటు నంద గోపాల్ లు డబ్బాలో వేసి లాటరీ పద్దతిలో డ్రా తీసి దుకాణాదారులను గుర్తిస్తున్నారు.

లక్కీ తగిలినవారు ఆనందంగా వెళుతుండగా, లక్కీ తగలని వారు విషాదంగా గార్డెన్స్ నుంచి వెళుతున్నారు. చాలా వరకు సిండికేట్ గా వేయడంతో ఒక దుకాణం మిస్సయితే మరో దుకాణంలోనైనా లక్కీ తగలదా..! అని గార్డెన్ అవతల చర్చించుకుంటున్నారు. సాయంత్రం వరకు ఈ లాటరీ విధానం కొనసాగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు గురువయ్య (మంచిర్యాల), ఇంద్రప్రసాద్ (బెల్లంపల్లి), ఎం హరి (చెన్నూర్), ఎస్ సమ్మయ్య(లక్షెట్టిపేట), కందుల తిరుపతి, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులున్నారు.