13-12-2025 01:29:55 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతున్నదని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి జర్మనీ పార్లమెంట్ బృం దంతో భట్టి భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, కలిసి పనిచేద్దామన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, జర్మనీ ప్రసిద్ధి చెందిన మెటలర్జీ, కార్ల తయారీరంగాల్లో జర్మనీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ఆసక్తిగా ఉందని వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నదని, దీంతోపాటు మూసీ పునర్జీవనం, వ్యవ సాయ ఆధారిత రంగంపైన ఆసక్తిగా ఉందని, హై దరాబాద్ ఐటీ రంగానికి హబ్గా వెలుగొందుతున్నదని స్పష్టంచేశారు.
ఈ రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ వర్సిటీలో జర్మన్ లాంగ్వే జ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని, తద్వారా తెలంగాణ విద్యార్థులు జర్మనీ భాష నేర్చుకొని ఆ దేశంలో పనిచేసేందు కు అవకాశం ఉంటుందని వివరించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నా రు.
సైబర్ సెక్యూరిటీ విషయాల్లో చాలా దూర దృష్టితో సైబర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేశామని జర్మనీ పార్లమెంట్ బృందానికి వివరించారు. ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం ప డుతున్నాయని, ఫైనాన్స్ రంగంలో సైబర్ ఫిషింగ్ ఎలా జరుగుతుంది.. వాటిని అరికట్టేందుకు బెస్ట్ ఏఐ టూల్స్ వాడుతున్నట్టు వెల్లడించారు.
విజన్ డాక్యుమెంట్ అద్భుతం: జర్మనీ బృందం
రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని జర్మనీ పార్లమెంట్ బృందం అభినందించింది. ప్రతి రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను ఈ విజన్ డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొనడం అభినందనీయమని, రాష్ర్ట ప్రగతి పట్ల మీ నిబద్ధత ఈ డాక్యుమెంట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ప్రశంసించింది.
సైబర్ సెక్యూరిటీ, స్కిల్ లేబర్ అంశాల్లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నామని పేర్కొన్నది. జర్మనీ వ్యాపారులు చాలామంది భారత్లో పెట్టుబడులు పెట్టారని, తమ దేశానికి చెందిన బోష్ వంటి ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నాయని తెలిపింది. భారత్కు చెందిన 60 వేల మంది విద్యార్థులు జర్మనీలో వివిధ రకాల కోర్సులను అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నది.
జర్మనీ బృందంలో జోసెఫ్ ఓస్టర్, డానియల్, తైజెన్ అటావోగ్లూ, బెర్డ్న్ బౌమన్, లార్స్ కాస్టెల్లుక్కి, లామ్య కడ్డోర్, క్లారా బంజర్, క్రిస్టినా ఉన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఇందన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ప్రణాళిక శాఖ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు పాల్గొన్నారు.