02-10-2025 12:09:46 AM
మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలో బయటపడ్డ విగ్రహం
ఆదిలాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవా ల సందర్భంగా అద్భుత ఘటన చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గా మాత మండపం వద్ద స్వయంభూగా వియకుని విగ్రహం వెలిసింది. బుధవారం దుర్గా దేవి మండపం వద్ద ఆదిలాబాద్ మున్సిపల్ కమిషన్ రాజుతో పాటు కాలనీవాసులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా వినాయకుని విగ్రహం బయటపడింది. దీంతో కమిషనర్తో పాటు కాలనీవాసులు ఆశ్చర్యానికి గురై ఆ వినాయకుని విగ్రహాన్నీ అక్కడే ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ మండపం వద్ద వినాయకుడి విగ్రహం బైట పడటం అంత దైవ సంకల్పమని కాలనీవాసులు పేర్కొన్నారు.