12-05-2025 06:52:57 PM
నిర్మల్,(విజయక్రాంతి): సెల్ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సీఈఐఆర్(CEIR) ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం పోగొట్టుకున్న, చోరి గురైన 52 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఎస్పీ మొబైల్ వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలన్నారు. పోయిన సెల్ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సీఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
సీఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని చెప్పారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1309 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. సీఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, సీఈఐఆర్ టీం కానిస్టేబుల్ రాజేశ్వర్, నరేందర్, ప్రత్యూష, సూర్య వంశీ, రాం పవన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.