13 July, 2026 | 9:46 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

09-06-2024 12:17 PM

అచ్చంపేట : ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులు భరించలేక ఇద్దరు భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... జినుకుంట గ్రామానికి చెందిన మహేష్(22) భానుమతి(20) ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి వేధింపులకు గురి చేసేవారు.

పెద్దలను ఒప్పించి అదే గ్రామంలో ఇరువురు నివాసం ఉంటున్న క్రమంలో శనివారం రాత్రి మహేష్ తండ్రితో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ జంట ఆదివారం తెల్లవారుజామున వారి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సిఐ రవీందర్ తన సిబ్బందితో కలిసి చేరుకొని పూర్తి వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.