20 March, 2026 | 9:18 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

‘సెయింట్ పాల్స్’లో మాక్‌పోల్

09-08-2024 01:04 AM

కరీంనగర్ సిటీ, ఆగస్టు 8 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలోగల సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు మాక్‌పోల్ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాల డైరెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని.. ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు వినియోగం, ఎన్నికల్లో పోటీచేసేందకు అర్హతలు తదితర వాటి గురించి విద్యార్థులు.. ఉపాధ్యాయులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.