01-11-2025 07:03:58 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ గా మదన్మోహన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. డిఆర్వోగా విధులు నిర్వహిస్తున్న మదన్ మోహన్ కు అదనపు బాధ్యతలను కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను మదన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళలు మనం ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలో ఇందిరమైన పథకానికి సంబంధించి నిర్మాణ పనుల్లో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా 100% పనులు జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు.