మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

06-05-2024 02:16:48 AM

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌కు త్రుటిలో ప్రమా దం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారు రెండు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అదివారం మధుయాష్కీ గౌడ్ వరంగల్ వెళ్లుతుండగా ఆలేరు సమీపంలో ఘటన చోటుచేసుకున్నది. ప్రమాదంలో మధుయాష్కీతోపాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ఫగాయాలయ్యాయి.