29-05-2025 04:58:05 PM
గురుకులం సొసైటీ సెక్రటరీ వర్షిణి తీరుపై..
మాదిగ హక్కుల దండోరా ఆందోళన..
వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): విద్యార్థులు టాయిలెట్ కడుగుతే తప్పేంటి అన్న సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి(Social Welfare Gurukula Secretary Alugu Varshini) వ్యాఖ్యానాలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. విద్యార్థుల పట్ల అనుచితంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎంహెచ్డీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఆందోళనకు దిగారు. టాయిలెట్లు కడుగుతే తప్పేంటి అన్న ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిని విధుల నుండి తొలగించి ఆమె అహంకారానికి తగిన బుద్ధి చెప్పాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు(Chiluka Rajanarsu) డిమాండ్ చేశారు.
తెలంగాణ గురుకుల సొసైటి సెక్రటరీ అలుగు వర్షిణి ఒక వీడియోలో మాట్లాడుతూ... గురుకుల పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్లు కడుగుతే తప్పేంటి, వారి రూమ్ లు వారే క్లిన్ చేసుకోవాలి,వారి బట్టలు వారే ఉత్కోవాలి ఎవరచ్చి చేస్తారనీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఏమైనా పై కులం నుండి వచ్చారా ? అని విద్యార్థుల పట్ల అవమాన కరంగా మాట్లాడిన ఆమెకు కార్యదర్శిగా కొనసాగే అర్హత లేదన్నారు. గురుకులాల సొసైటి సెక్రటరీ అలుగు వర్షిణి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి కాబట్టే ఆమె గురుకుల పాఠశాలలకు సెక్రటరీ గా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం SC ST విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాల్లో గౌరవ ప్రదంగా ఉండలని చదువు ద్వారానే ఒక సామాన్యుడు అసామాన్యుడుగా మారి సమాజంలో గౌరవం పొందుతాడని Dr BR అంబేద్కర్ ఆలోచనల నేపథ్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి గురుకులను కట్టించారని తెలిపారు. ప్రభుత్వం వేలాది రూపాయల జీతాలు ఇస్తూ వారిని నియమిస్తే ఇలా మా గురుకుల విద్యార్థుల పట్ల అత్యంత హేయంగా అవమానకరంగా మాట్లాడడం బాధాకరమని వాపోయారు. ఇలాంటి సంఘటనలు వృతo కాకుండా
ఎస్సీ గురుకులాకీ ఎస్సీ అధికారులనే సెక్రటరీగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్, సీనియర్ నాయకుడు కుషణపల్లి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అకునూరి రాజ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఇడిగిరాల ప్రసాద్, నాయకులు గొగర్ల శేఖర్, నియోజక వర్గ ఇంచార్జి ఎనగందుల శివాజీ పట్టణ అధ్యక్షుడు బెజ్జలా సంపత్ పట్టణ కార్యదర్శివేముల మల్లేష్, కోశాధికారి తుంగపల్లి వెంకటేశ్, పట్టణ సీనియర్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.