29-05-2025 04:46:05 PM
ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్ రావు..
తుంగతుర్తి (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు(Vempati Venkateswara Rao) అన్నారు. గురువారం మద్దిరాలలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు బ్రహ్మదేవర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మహిళ కళాబృందం డాన్స్ లతో మైమరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. ఆర్య వైశ్యులు అంది వచ్చిన ప్రతి ఎన్నికల్లో పాల్గొని తమ సత్తాను చాటాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు.
రానున్న రోజుల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు మంజూరుకు కృషి చేస్తామని అన్నారు. జూన్ 15న సూర్యాపేటలో నూతన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మహంకాళి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా ఈగల లక్ష్మయ్య కోశాధికారిగా వంగపల్లి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరి గౌరీ శంకర్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ బండార్ రాజా, జిల్లా నాయకులు నూనె నాగన్న, తాటికొండ సీతయ్య, ఓరుగంటి శ్రీనివాస్, బ్రహ్మదేవర భిక్షం, మహంకాళి ప్రణీత్, మహంకాళి సోమయ్య, సూర్యనారాయణ, మా శెట్టి వెంకన్న, తల్లాడ సురేష్, తల్లాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు