29-05-2025 05:03:38 PM
శాంతిభద్రతలకు ప్రాధాన్యత..
రాచకొండ సీపీ సుధీర్ బాబు..
అంతరాష్ట్ర ఆమ్స్ ముఠా అరెస్ట్..
ఎల్బీనగర్: షాపు మాటున అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. మరో కేసులో నమ్మించి నగదు చోరీ చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇంకో కేసులో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు. గురువారం ఎల్బీనగర్(LB Nagar) లోని క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు(CP Sudheer Babu) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా కేసులో వివరాలు వెల్లడించారు. 2016లో యూపీ రాంపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన జీషాన్, అమీర్ బాలాపూర్ లో మంగళి షాపు నిర్వహిస్తూ ఆయుధాలను విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని దేశీయ ఆయుధాలు(పిస్టల్, బుల్లెట్లు) విక్రయిస్తున్నా, ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. రాబరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్..
మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఓబెర్ అనే వ్యక్తి అబ్దుల్లా ఖాదర్ కు డబ్బులు ఇవ్వాలి. ఖాదర్ తన స్నేహితులతో ప్లాన్ వేసి డబ్బులు కాజేయాలని చోరీ చేశాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రూ, 28 లక్షలు పట్టుకున్నాం..
మరో కేసులో దొంగ అరెస్టు
పహాడిషరీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతున్న అల్లం శివ అనే వ్యక్తి ని అరెస్ట్ చేశారు. నిందితుడు శివ నుండి రూ, 20 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.