16-01-2026 11:30:03 AM
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యం కొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని వారి నివాసంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, మన్యం కొండ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేసి ఆహ్వానించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, బ్రహ్మోత్సవాల్లో ఏదైనా ఒక రోజు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.