16-01-2026 11:31:41 AM
ముత్తారం,(విజయ క్రాంతి): మండలంలోని సీతంపేట గ్రామ స్థాయిలో సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గ్రామానికి చెందిన జక్కుల సుధీర్ టీమ్ విన్నర్ గా నిలిచింది. రన్నర్ గా కూరుకుల వినయ్ టీమ్ గెలుపొందింది. రెండు టీమ్ లకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహించిన 5వ వార్డు సభ్యులు బోయిని శ్రీనివాస్, మధురం హోటల్ వాళ్ళకు, క్రీడాకారుల తరుపున ధన్యవాదాలు తెలిపారు.