calender_icon.png 24 October, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా

22-10-2025 06:15:05 PM

అచ్చంపేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని నాగర్ కర్నూల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్ తెలిపారు. ధర్నాలో మాజీ ఐఏఎస్ చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, డా.విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ధర్నాలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ సాయి మహారాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పు సురేష్, రవి, శ్రీధర్, లింగం, వీరయ్యలు పాల్గొన్నారు.