13-02-2026 07:52:39 PM
రంగులతో ముస్తాబైన ఆలయం
పాపన్నపేట,ఫిబ్రవరి13: మహాశివరాత్రిని(Mahashivratri) పురస్కరించుకొని మండల కేంద్రం పాపన్నపేటలోని శివాలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ పేర్కొన్నారు. ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యావచనంతో ప్రారంభమై కళ్యాణం జరగనున్నట్లు తెలిపారు. శివపార్వతుల వివాహతంతును భక్తులు కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.