21-06-2025 02:36:46 AM
తిరుమలగిరి, జూన్ 20: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డులో తెలంగాణ రాష్ట్రం గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిఎంపిఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న సూర్యాపేట జిల్లాలో జరిగే మూడవ మహాసభలను జయప్రదం చేయాలని .సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు ఎటువంటి డీడీలు లేకుండానే గొర్లను మేకలను సబ్సిడీ కింద ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ నాయకులు కార్యకర్తలు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.